Devireddy Sudheer Reddy

Devireddy Sudheer Reddy

Share

This is the official page of Devireddy Sudheer Reddy, Chairman Musi Riverfront Development Corp.LTD. Devireddy Sudheer Reddy, Chairman MRDCL, MLA, LB Nagar

Photos from Devireddy Sudheer Reddy's post 23/05/2026

ఇందిరా పార్కు వద్ద సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాసయాదవ్ గారు,ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు.

23/05/2026

జంటనగరాల్లో తీవ్రమవుతున్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం ఎదుట ఎల్‌బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Photos from Devireddy Sudheer Reddy's post 23/05/2026

ఖైరతాబాద్‌లో తాగునీటి సమస్యలపై ఎల్బీనగర్ శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఆందోళన….

జంట నగరాల్లో తీవ్రంగా నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు రెండు నెలలుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజుకు 750 ఎంజీడీల నీటి అవసరం ఉండగా కేవలం 550 ఎంజీడీలే సరఫరా చేస్తున్నారని తెలిపారు. మరోవైపు రోజుకు 12 వేల ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం, పైప్‌లైన్ ద్వారా సరైన సరఫరా లేకపోవడాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.

ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నీటి సరఫరాను మెరుగుపర్చకపోతే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

23/05/2026
23/05/2026

తాగునీరు మా హక్కు…నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు?

ప్రజలకు నీళ్లు కావాలి… హామీలు కాదు!

22/05/2026

చింతలకుంట అండర్‌పాస్ రోడ్డు పనుల ఆలస్యంపై ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ ఈఈ రోహిణి గారితో ఫోన్‌లో మాట్లాడి, పనులను వెంటనే వేగవంతం చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Photos from Devireddy Sudheer Reddy's post 22/05/2026

చింతలకుంట అండర్‌పాస్ రోడ్డు మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.

చింతలకుంట అండర్‌పాస్ వద్ద కొనసాగుతున్న రోడ్డు మరమ్మత్తు పనుల నత్తనడకపై ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈరోజు చింతలకుంట అండర్‌పాస్ వద్ద జరుగుతున్న పనులను సుధీర్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్.బి.నగర్ జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ ఈఈ రోహిణి గారితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే గారు, ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలన్నర క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.

అండర్‌పాస్ వద్ద సగం రోడ్డు పనులు మాత్రమే పూర్తి చేసి మిగిలిన పనులను మధ్యలో నిలిపివేయడంతో హయత్‌నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యూ-టర్న్ కోసం ఎల్.బి.నగర్ రింగ్ రోడ్డు వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయని అన్నారు.

ప్రతి రోజు వేలాది మంది ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చింతలకుంట అండర్‌పాస్ రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సుధీర్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

22/05/2026

ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో బూత్ లెవల్ ఏజెంట్స్ (BLAs) శిక్షణ శిబిరం నిర్వహించారు. పార్టీ బలోపేతం, ఓటరు నమోదు, ఎన్నికల నిర్వహణలో BLAs పాత్ర కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

Photos from Devireddy Sudheer Reddy's post 22/05/2026

ఎల్బీనగర్ నియోజక వర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు కుట్టు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.

చంపాపేట్ డివిజన్ పరిధిలోని మోడల్ మార్కెట్ భవనం వెనుక ఉన్న కమ్యూనిటీ హాల్‌లో జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు కుట్టు యంత్రాల వినియోగం, వివిధ రకాల దుస్తుల కుట్టు విధానాలు, ఆధునిక డిజైనింగ్ పద్ధతులపై నిపుణులచే శిక్షణ అందించబడుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

ఆసక్తి గల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజి రెడ్డి, రవి ముదిరాజ్, యాది రెడ్డి, చీర శ్రీనివాస్, ప్రభాకర్, కనకేష్, సతీష్ గౌడ్, నందు, జంగయ్య గార్లు ట్రైనర్లు స్వయంప్రభ, రమాదేవి, ఉష, సంధ్య, ప్యారి గార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు మరియు పరిసర ప్రాంతాల మహిళలు పాల్గొన్నారు.

21/05/2026

బ్రతికున్నంత కాలం కులమతాల పేరుతో మనుషులు విడిపోయినా… చివరి ప్రయాణంలో మాత్రం భేదాలు ఉండకూడదనే మానవతా దృక్పథంతో, అన్ని మతాల ప్రజల కోసం నాగోల్ ఫతుల్లాగూడలో 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన “ముక్తి ఘాట్” ఎల్‌బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి గొప్ప ఆలోచనకు ప్రతీక.

Photos from Devireddy Sudheer Reddy's post 21/05/2026

ఈరోజు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు నియోజకవర్గాల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు హాజరై ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు అంశాలను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా బైరామల్‌గూడ చెరువు అభివృద్ధికి పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు. సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ పనులకు ఇప్పటివరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని, మిగిలిన నిధులను వెంటనే విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

హస్తినాపురం జంక్షన్ నుంచి సాగర్ కాంప్లెక్స్ వరకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. అలాగే ఆనంద్‌నగర్ చౌరస్తా వద్ద కూడా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న వీధి కుక్కల సమస్యపై ప్రత్యేకంగా స్పందిస్తూ, ఇటీవల కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనను ప్రస్తావించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు.

బీఎన్‌రెడ్డి నగర్ తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని సూచించారు. అలాగే టీకేఆర్ కాలేజ్ సమీపంలో ప్రతిపాదిత ఫ్లైఓవర్ ప్రస్తుతం అవసరం లేదని, ఆ ప్రతిపాదనను పునఃసమీక్షించాలని కోరారు.

బీడీ రెడ్డి గార్డెన్ సమీపంలో భూ వివాదాల కారణంగా నిలిచిపోయిన స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను వెంటనే పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హస్తినాపురం డివిజన్‌లోని ద్వారకా తిరుమల నగర్ ప్రాంతంలో ఒక మీటర్ పైప్‌లైన్ విస్తరణ చేపట్టి తాగునీటి సరఫరాను బలోపేతం చేయాలని కోరారు.

అలాగే మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని డంపింగ్ యార్డు సమీపంలోని పాత పోచంపల్లి రోడ్డు పునరుద్ధరణ కోసం అటవీ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువుల వద్ద ఎస్‌టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసి చెరువుల సుందరీకరణ పనులు చేపట్టాలని కూడా ఎమ్మెల్యే గారు కోరారు.

ఈ సమస్యలపై సంబంధిత శాఖలు ప్రాధాన్యత ఆధారంగా స్పందించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Lal Bahadur Nagar
Hyderabad
500074