Bandi Ramesh

Bandi Ramesh

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bandi Ramesh, Politician, Hyderabad.

11/06/2026

Bandi Ramesh

10/06/2026

మనల్నేవడ్రా ఆపేది💪 ఏ వర్షం ఆపలేదు.. అక్కాచెల్లెమ్మలకి అండగా ఉన్న రేవంతన్న సంకల్పాన్ని❤️❤️

Photos from Bandi Ramesh's post 09/06/2026

హైదరాబాద్ మియాపూర్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్ధ కోసం శాశ్వత అధికారిక భవన నిర్మాణ ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు.

Photos from Bandi Ramesh's post 09/06/2026

Today's News Paper Clips

08/06/2026

*ఈ రోజు హైదరాబాద్ మియాపూర్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్ధ కోసం శాశ్వత అధికారిక భవన నిర్మాణ ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన చెత్త సేకరణ ఎలెక్ట్రిక్ వాహనాలను అలాగే ఎకో ఫ్రెండ్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాంకేతికతను, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్,శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ నవీన్ యాదవ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి గుమ్మల శ్రీజన (ఐఏఎస్) గార్లతో కలిసి పరిశీలించారు.*

08/06/2026

*రూ 99 కోట్లతో ఉప్పల్ భగాయత్ లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంతోపాటు పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు*

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారు టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ *బండి రమేష్* గారు పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు

08/06/2026

*CM రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మియాపూర్‌లో CMC కార్యాలయ శంకుస్థాపన*

*జూన్ 8న బహిరంగ సభ - కూకట్పల్లి కాంగ్రెస్ క్యాడర్‌కు బండి రమేష్ గారి పిలుపు*

*హైదరాబాద్:* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు అనగా జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు మియాపూర్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయ శంకుస్థాపన మరియు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టిపిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ *శ్రీ బండి రమేష్ గారి ఆధ్వర్యంలో* కూకట్పల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు,కార్యకర్తలు, అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ వివిధ భాగాలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
జై తెలంగాణ.. జై కాంగ్రెస్..

*ఇట్లు,*
*కాంగ్రెస్ పార్టీ కార్యాలయం*
*కూకట్పల్లి నియోజకవర్గం*

Photos from Bandi Ramesh's post 07/06/2026

పార్టీ కమిటీల ఏర్పాటులో ఎస్సీ సోదరులందరికీ సముచిత న్యాయం సమన్నతస్థానం కల్పించడం జరుగుతుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *బండి రమేష్* గారు పేర్కొన్నారు. పార్టీ మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చెన్నయ్య ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం కార్యాలయం హేమ దుర్గా భవన్లో ఆదివారం ఎస్సీ సోదరులతో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు డివిజన్లకు కమిటీల నియామకం కోసం ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బండి రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కమిటీల ఏర్పాటు పాత కొత్తల మేలు కలయికగా ఉంటుందని తద్వారా అందరికీ పార్టీలో తగిన గౌరవం గుర్తింపు ఉంటాయని ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు .అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లోను ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఎస్సీ సోదరులను గుర్తించి వారికి పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. సీనియర్ల సేవలను పార్టీకి ఉపయోగించుకుంటూనే కొత్త వారికి సైతం అవకాశాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే అన్ని కమిటీల ను పూర్తిచేసి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య , కరక పెంటయ్య,బాల నరసింహ, రమేష్ ,కృష్ణ, రాము, రమాదేవి ,తదితరులు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad