Veda Software
NEWS MAGAZINE
15/11/2024
కూసుమంచి,రిపబ్లిక్ హిందుస్థాన్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కూసుమంచిలోని గణపేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు.శుక్రవారం తెల్లవారుజామున కార్తిక స్నానాలు ఆచరించి శివాలయానికి వచ్చి మహాశివుని దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం.ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శేషగిరి శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.దీంతో శివాలయం కోలాహాలంగా మారింది. శివాలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో పులిహార ప్రసాదం అందజేశారు.
కూసుమంచి గణపేశ్వరాలయానికి పోటెత్తిన భక్తజనం….! కూసుమంచి,రిపబ్లిక్ హిందుస్థాన్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కూసుమంచిలోని గణపేశ్వరాలయానికి భక్తులు పోటె.....
14/11/2024
చలో ఉట్నూర్ 20-11-2024స్థలం :ఆదివాసీ భవన్ సమయం: ఉదయం 10:00 గంటలకు ఆదిలాబాద్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (కుంరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ) ఉట్నూర్ కేంద్రంగా తుడుం దెబ్బ మహా సభ నిర్వహించడం జరుగుతుంది.కావున తుడుం దెబ్బ జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు, మండల కమిటీలతో పాటు తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళా ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ రైతు ఆదివాసీ యువజన సంఘాలు హాజరై విజయవంతం చేయగలరని తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ పుర్క బాపురావు అన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడప నగేష్ ,మేడిగూడ రేయి సెంటర్ సార్మెడి కుమ్ర శంభు , తుడుం దెబ్బ బోథ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్రం మహేందర్ తదితరులు పాల్గొన్నరు.
ఉమ్మడి ఆదిలాబాద్ మహాసభను విజయవంతంతుడుం…. దెబ్బ పిలుపు…. చేద్దాం … చలో ఉట్నూర్ 20-11-2024స్థలం :ఆదివాసీ భవన్ సమయం: ఉదయం 10:00 గంటలకు ఆదిలాబాద్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్....
14/11/2024
జిల్లాలో 29 కేంద్రాలు ఏర్పాటు పరీక్షకు హాజరైతున్న అభ్యర్థులు 10,255 అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి: అభ్యర్థులను ఉదయం 9.00 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీల తో పరీక్ష కేంద్రం కు రావాలి: అభ్యర్థులుఎట్టి పరిస్థితుల్లోనూ తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదు: పరీక్షా కేంద్రాల లో ఆన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి : ఆర్టీసీ : బస్ సకాలం లో బస్ సౌకర్యం కల్పించాలి, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి: జిల్లా పాలనాధికారి రాజర్షి షా …...
టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ జిల్లాలో 29 కేంద్రాలు ఏర్పాటుపరీక్షకు హాజరైతున్న అభ్యర్థులు 10,255అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరు...
13/11/2024
• పిడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం.... • 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నాం... • అక్రమార్కుల అరెస్టులు తప్పదు.... • రేషన్ బియ్యం అక్రమ మళ్ళింపులో కొందరు ఎండీయూల ప్రమేయం.... •అక్రమ రవాణా జరగకుండా ప్రజల భాగస్వామ్యం అవసరం.... • శాసనమండలిలో రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్.... రిపబ్లిక్ హిందుస్థాన్, అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.....
రేషన్ మాఫియాపై 1010 కేసులు నమోదు • పిడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం….• 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చ.....
12/11/2024
ఆదిలాబాద్ : జిల్లాల్లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసేందుకు అంతే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించడం కోసం రూపొందించిన కార్యక్రమమే ఆరోగ్య పాఠశాల అని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆన్నారు.మంగళవారం రిమ్స్ ఆసుపత్రి లోని ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నవంబర్ 14 వ తేదీ నుండి అన్ని ఉన్నత పాఠశాలల్లో, KGBV, ఇంటర్ కళాశాలల్లో ప్రారంభం కావడం జరుగుతుందనీ, ఒక్కో వారం ఒక్కో అంశాన్ని అమలు చేయనున్నారనీ, 4 వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమలో ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత...
ఆరోగ్య పాఠశాల మనందరి బాధ్యత ఆదిలాబాద్ : జిల్లాల్లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అల...
12/11/2024
సౌది అరేబియా: నవంబర్ 8 శుక్రవారం న అద్భుతమైన దీపావళి వేడుకలతో జెడ్డాలోని భారత కాన్సులేట్ వెలిగిపోయింది. ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతి మరియు దీపావళి స్ఫూర్తిని జరుపుకునే సాంస్కృతిక ప్రదర్శనల యొక్క శక్తివంతమైన చిత్రాలను ప్రదర్శించింది. మంత్రముగ్దులను చేసే క్లాసిక్ నృత్యాల నుండి గుడ్ హోప్ మరియు ఫినోమ్ అకాడమీల ఆకర్షణీయమైన సినిమా ప్రదర్శనలు గొప్ప వారసత్వం మరియు సంస్కృతికి ఉదాహరణగా నిలవడంతో పాటు, జెడ్డాలోని భారతీయ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, ఐక్యత, స్నేహ భావాన్ని పెంపొందించాయి. సాంప్రదాయ దీపం వెలిగించడం 'డీప్ డాన్' ఒక అందమైన స్వరాన్ని సెట్ చేయడం ద్వారా ఈ పండుగకు సానుకూలత మరియు దైవిక శక్తిని జోడించింది....
NRI : జెడ్డాలో భారత కాన్సులేట్ లో అంబరాన్ని అంటిన దీపావళి 2024 సంబరాలు సౌది అరేబియా: నవంబర్ 8 శుక్రవారం న అద్భుతమైన దీపావళి వేడుకలతో జెడ్డాలోని భారత కాన్సులేట్ వెలిగిపోయింది. ఈ కార్య....
10/11/2024
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న జడ్పీఎస్ఎస్ స్కూల్ ను సందర్శించిన షీ టీం, విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు షీ టీం విధులు మరియు సైబర్ క్రైమ్ గురించి వివరించారు. విద్యార్థులను ఎవరైనా ఆకతాయిలు వేధించినప్పుడు, స్ట్రీట్ హారాస్మెంట్ చేసినప్పుడు చట్టరీత్యా నేరమని, అటువంటి వారికి చర్యలు తప్పవని షీ టీం స్పష్టంగా తెలియజేసింది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే షీ టీం నెంబర్ 8712659953కి కాల్ చేయాలని సూచించారు. కంప్లైంట్ చేసిన వారి పేరు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు....
లక్ష్మీపూర్ గ్రామంలో షీ టీం అవగాహన కార్యక్రమం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న జడ్పీఎస్ఎస్ స్కూల్ ను సందర...
08/11/2024
https://epaper.republichindustan.in/inner/287/ts_main_edition02-10-2024-08-16-42 #
కేసీఆర్ దోచుకున్నది కక్కిస్తారా...?
07/11/2024
ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఆనాడు నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెప్టెంబరు నెలాఖరులో విద్యాశాఖ కోరింది. ఈక్రమంలో ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి వారికి కొలువులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సంగారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో బాధితులున్నట్లు గుర్తించారు. ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ అధికారిని పరిశీలకునిగా నియమించారు. ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
త్వరలో డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు ...
07/11/2024
మహబూబ్ నగర్ : జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.
ఏసీబీకి పట్టుబడిన డీఈఓ..రవీందర్ మహబూబ్ నగర్ : జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్.....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Adilabad
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |