Ryaga Krishnaiah
R Krishnaiah a MP and prominent politician and social activist since 50 years. Ex. MLA, LB NAGAR
17/06/2026
విద్య హక్కు చట్టం 2009… పేద పిల్లల భవిష్యత్తుకు రాజ్యాంగం ఇచ్చిన హామీ… దేశమంతా అమలవుతున్న చట్టం… తెలంగాణ పిల్లలకు మాత్రం ఇంకా దూరమేనా?
15/06/2026
ప్రభుత్వ పాఠశాలలు మూసివేతను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి
విద్యార్థులపై తెచ్చిన ఆర్ఆర్ యాక్టిని ఎత్తివేయాలి విద్యార్థులకు రావలసిన 10వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
రాజ్యసభ MP ఆర్ కృష్ణన్న…
14/06/2026
జీవో నెం.7 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి, ఫీజు రీయింబర్స్మెంట్ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు
13/06/2026
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి - రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
05/06/2026
బీసీ కార్పొరేషన్లు – ఆశల నుంచి ఆవేదన వరకు…
దశాబ్ద కాలంగా కేటాయింపులు, ప్రకటనలు, పథకాల మధ్య నలిగిపోతున్న కార్పొరేషన్ల అసలు కథ…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన ఉద్యమంలో సామాజిక న్యాయం ప్రధాన నినాదాలలో ఒకటి. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలన్న ఆకాంక్ష తెలంగాణ సమాజంలో బలంగా వ్యక్తమైంది. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తవుతున్న వేళ, వెనుకబడిన తరగతుల (బీసీ) అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు తమ లక్ష్యాలను ఎంతవరకు నెరవేర్చాయనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది.
బీసీలు తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన వర్గం. తాజా సామాజిక-ఆర్థిక కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీల శాతం 56కు పైగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ వాస్తవం బీసీల ఆర్థిక, విద్యా, సామాజిక సాధికారత కోసం మరింత బలమైన విధానాలు అవసరమని సూచిస్తోంది.
రాష్ట్రంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్తో పాటు వివిధ వృత్తి ఆధారిత కార్పొరేషన్లు, సహకార సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. గౌడ, మత్స్యకార, నేత, రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ముదిరాజ్, కురుమ, యాదవ తదితర వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రారంభ దశలో ఈ ప్రకటనలు బీసీల్లో అపారమైన ఆశలను రేకెత్తించాయి. స్వయం ఉపాధి రుణాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుతాయని భావించారు.
కానీ వాస్తవ పరిస్థితి ఆ ఆశలకు పూర్తిగా అనుగుణంగా సాగిందా? అనే ప్రశ్నకు సమాధానం అంత సంతృప్తికరంగా కనిపించదు.
గత పదేళ్లలో ప్రతి బడ్జెట్ సందర్భంగా బీసీ సంక్షేమానికి భారీ కేటాయింపులు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటించాయి. వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు కాగితాలపై కనిపించాయి. అయితే కేటాయింపు ఒకటి, విడుదల మరోటి, ఖర్చు ఇంకొకటి అన్న పరిస్థితి తరచుగా కనిపించింది. అనేక పథకాలకు నిధులు కేటాయించినప్పటికీ విడుదలలు ఆలస్యం కావడం, విడుదలైన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోవడం, లబ్ధిదారుల ఎంపికలో జాప్యం వంటి సమస్యలు కొనసాగాయి.
బీసీ కార్పొరేషన్ల అసలు ఉద్దేశం కేవలం రుణాలు ఇవ్వడం కాదు. సంప్రదాయ వృత్తులను ఆధునికీకరించడం, మార్కెట్ అనుసంధానం కల్పించడం, యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, కొత్త వ్యాపార అవకాశాలు సృష్టించడం, మహిళా సాధికారతకు తోడ్పడటం కూడా వాటి బాధ్యత. కానీ అనేక కార్పొరేషన్లు కార్యాలయ పరిమితుల్లోనే కుదించబడ్డాయనే విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు లక్షల రూపాయల ఆర్థిక సహాయం, స్వయం ఉపాధి యూనిట్లు, ప్రత్యేక రుణ పథకాలు ప్రకటించబడ్డాయి. అయితే అర్హులైన లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే సహాయం పొందిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉందని బీసీ సంఘాలు తరచూ పేర్కొంటున్నాయి. ప్రతి సంవత్సరం దరఖాస్తులు వేలల్లో వస్తున్నప్పటికీ, ఎంపికయ్యే వారు పరిమిత సంఖ్యలోనే ఉండటం ఆర్థిక అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
బీసీ కార్పొరేషన్ల పనితీరుపై మరో ప్రధాన విమర్శ ఏమిటంటే అవి ప్రభుత్వాల రాజకీయ ప్రచార సాధనాలుగా మారిపోయాయనే అభిప్రాయం. ఎన్నికల ముందు భారీ ప్రకటనలు చేయడం, తరువాత అమలులో నిర్లక్ష్యం చూపడం గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న ధోరణి. కార్పొరేషన్లకు పూర్తిస్థాయి చైర్మన్లు, బోర్డులు లేకపోవడం, సిబ్బంది కొరత, పరిపాలనా జాప్యాలు కూడా పనితీరును ప్రభావితం చేస్తున్నాయి.
ప్రత్యేకించి తెలంగాణలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ, వారి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరగలేదనే వాదన బలపడుతోంది. తాజాగా ప్రభుత్వం బీసీ సంక్షేమానికి కేటాయింపులు పెంచినట్లు ప్రకటించినప్పటికీ, బీసీ సంఘాలు మాత్రం జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు లేవని అంటున్నాయి. 2026-27 బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.12,500 కోట్లకు పైగా కేటాయింపులు ప్రకటించినా, ఆ నిధులు పూర్తిగా లక్ష్యిత వర్గాలకు చేరుతాయా లేదా అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి.
బీసీల అభివృద్ధి కేవలం సంక్షేమ పథకాలతో సాధ్యం కాదు. విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు, మార్కెట్ యాక్సెస్, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను సమగ్రంగా అనుసంధానించాలి. కానీ ప్రస్తుతం కార్పొరేషన్లు ప్రధానంగా సబ్సిడీ పంపిణీ సంస్థలుగానే మిగిలిపోయాయి. దీర్ఘకాలిక ఆర్థిక సాధికారత కోసం అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు కనిపించడం లేదు.
ఇంకో ముఖ్యమైన అంశం బీసీ ఉప ప్రణాళిక (BC Sub Plan). ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా చట్టబద్ధ ఉప ప్రణాళిక అవసరమనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. జనాభా నిష్పత్తి మేరకు నిధుల కేటాయింపు, ఖర్చులపై చట్టబద్ధ పర్యవేక్షణ ఉంటేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ఇంకా స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు.
తాజా కులగణన బీసీలు రాష్ట్ర జనాభాలో మెజారిటీ వర్గమని మరోసారి నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బీసీ కార్పొరేషన్లను కేవలం సంక్షేమ సంస్థలుగా కాకుండా ఆర్థికాభివృద్ధి యంత్రాంగాలుగా మార్చాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలంలో వ్యాపార ఇంక్యుబేషన్ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలు, స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు, మార్కెటింగ్ సహకార వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
గ్రామీణ తెలంగాణలో సంప్రదాయ వృత్తులు సంక్షోభంలో ఉన్నాయి. నేత కార్మికులు మార్కెట్ సమస్యలతో, మత్స్యకారులు మౌలిక వసతుల కొరతతో, రజకులు ఆధునిక యంత్రాల లేమితో, నాయీబ్రాహ్మణులు మారుతున్న జీవనశైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఒకేసారి ఆర్థిక సహాయం ఇవ్వడం సరిపోదు. స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే విధానాలు అవసరం.
బీసీ కార్పొరేషన్ల పనితీరును పారదర్శకంగా మార్చడం కూడా అత్యవసరం. ప్రతి సంవత్సరం ఎంత నిధులు కేటాయించారు? ఎంత విడుదల చేశారు? ఎంత ఖర్చు చేశారు? ఎంతమంది లబ్ధి పొందారు? అనే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సామాజిక ఆడిట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి.
తెలంగాణ అభివృద్ధి కథలో బీసీలు కేవలం ఓటు బ్యాంకు కాదు. వారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, చేతివృత్తుల నుంచి సేవారంగం వరకు ప్రతి రంగంలో వారి పాత్ర కీలకం. అలాంటి వర్గానికి సంబంధించిన కార్పొరేషన్లు బలహీనంగా ఉంటే సామాజిక న్యాయం అసంపూర్తిగానే మిగులుతుంది.
బీసీ కార్పొరేషన్లపై ఆశలు ఇంకా చనిపోలేదు. కానీ ఆ ఆశలు నెరవేరాలంటే ప్రకటనల రాజకీయాలు కాదు, అమలు రాజకీయాలు అవసరం. బడ్జెట్ పుస్తకాలలోని అంకెలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం బీసీలను జనాభా పరంగా మాత్రమే కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా గుర్తించి, కార్పొరేషన్లను నిజమైన సాధికారత వేదికలుగా మార్చగలిగితేనే సామాజిక న్యాయం అనే తెలంగాణ ఉద్యమ లక్ష్యం సార్థకం అవుతుంది.
లేకపోతే బీసీ కార్పొరేషన్లు ప్రజల ఆశల చరిత్రలో మరో అసంపూర్తి అధ్యాయంగానే మిగిలిపోతాయి.
వ్యాసకర్త :
గుజ్జ సత్యం. M.Com,BLISc,PGDCA.
జాతీయ ఉపాధ్యక్షులు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం.
#బీసీకార్పొరేషన్లు
#గుజ్జసత్యం
02/06/2026
02/06/2026
R Krishnaiah Demands BC Bandhu Scheme in Telangana | CM Revanth | Telangana Formation Day | Ptv ...
02/06/2026
R. Krishnaiah demands ₹20 lakh aid per BC family on Telangana Formation Day. R. Krishnaiah, President of the National BC Welfare Association, has demanded that Chief Minister Revanth Reddy announce a financial assistance of ₹20 lakh p...
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad
500044